కోమటిరెడ్డి ఓటమికి కారణాలు..!

On

మునుగోడు ఉప ఎన్నిక యావత్ దేశాన్ని ఆకర్షించింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్ని ఓటర్లు కూడా అంతే రేంజ్ లో ఊహించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ప్రధాన పార్టీలన్ని కదన రంగంలోకి దిగాయి. అయితే రాజగోపాల్ రెడ్డి ఓటమికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ ఉంది. న్యూస్ ఇండియా తెలుగు పరిశీలనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మొదట్లో రాజగోపాల్ రెడ్డి వైపే ప్రజల మొగ్గు ఉన్నా.. గులాబీ […]

మునుగోడు ఉప ఎన్నిక యావత్ దేశాన్ని ఆకర్షించింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్ని ఓటర్లు కూడా అంతే రేంజ్ లో ఊహించారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ప్రధాన పార్టీలన్ని కదన రంగంలోకి దిగాయి. అయితే రాజగోపాల్ రెడ్డి ఓటమికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ ఉంది.

న్యూస్ ఇండియా తెలుగు పరిశీలనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మొదట్లో రాజగోపాల్ రెడ్డి వైపే ప్రజల మొగ్గు ఉన్నా.. గులాబీ దళం వ్యూహత్మకంగా చేపట్టిన సోషల్ మీడియా ప్రచారం
రాజగోపాల్ రెడ్డికి నెగటివ్ అయ్యింది.

తులం బంగారం.. ఓటుకు 30 వేలు ..అంటూ ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కంటే.. బీజేపీ ..కోమటిరెడ్డి నుంచే ఓటర్లు ఆశించేలా టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యింది.

అయితే తీరా ఎన్నికల వేల కేవలం మూడు నుంచి, నాలుగు వేలు మాత్రమే పంచడంతో ఓటర్లు నిరాసక్తకు గురయ్యారు. ఇది కూడా నెగటివ్ అయ్యింది.

అటు కాంట్రాక్టర్ల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారనే లైన్ ను ప్రజల్లోకి టీఆర్ఎస్ బలంగా తీసుకెళ్లింది. దీంతో సింపతీ ఓట్లు కోమటిరెడ్డి కోల్పోయారు.

అటు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ పార్టీ గెలవకపోయినా ఫరవాలేదు.. కానీ రాజగోపాల్ రెడ్డి గెలవొద్దనే కోణంలోనే ప్రచారం చేశారు. ఇది కూడా రాజగోపాల్ రెడ్డికి నెగటివ్ గా మారింది.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం