జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక

On
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన  హెడ్ కానిస్టేబుల్  పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  ఆదివారం జరిగిన ఈ పోటీల్లో  1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు,  400 మీటర్ల పరుగు పందెంలో  వెండి  పథకాలు  సాధించారు.  ఓపెన్ క్యాటగిరీలో  50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి  కోతగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఆర్ ఐ  సుధాకర్  ఆధ్వర్యంలో ఎంటి వింగ్  విభాగంలో  హెడ్ కానిస్టేబుల్  వీరభద్రం  విధులు నిర్వహిస్తున్నారు. సిఐ చెన్నూరి శ్రీనివాస్ సహాయ సహకారం, ప్రోద్భలంతో వీరభద్రం రాష్ట్ర స్థాయిలో రాణించి ఈ నెల 31 నుండి ఫిబ్రవరి3 వరకు కేరళలోని తిరుతిలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక