జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక

On
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన  హెడ్ కానిస్టేబుల్  పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  ఆదివారం జరిగిన ఈ పోటీల్లో  1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు,  400 మీటర్ల పరుగు పందెంలో  వెండి  పథకాలు  సాధించారు.  ఓపెన్ క్యాటగిరీలో  50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి  కోతగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఆర్ ఐ  సుధాకర్  ఆధ్వర్యంలో ఎంటి వింగ్  విభాగంలో  హెడ్ కానిస్టేబుల్  వీరభద్రం  విధులు నిర్వహిస్తున్నారు. సిఐ చెన్నూరి శ్రీనివాస్ సహాయ సహకారం, ప్రోద్భలంతో వీరభద్రం రాష్ట్ర స్థాయిలో రాణించి ఈ నెల 31 నుండి ఫిబ్రవరి3 వరకు కేరళలోని తిరుతిలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

Views: 27
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..