జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక

On
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన  హెడ్ కానిస్టేబుల్  పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  ఆదివారం జరిగిన ఈ పోటీల్లో  1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు,  400 మీటర్ల పరుగు పందెంలో  వెండి  పథకాలు  సాధించారు.  ఓపెన్ క్యాటగిరీలో  50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి  కోతగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఆర్ ఐ  సుధాకర్  ఆధ్వర్యంలో ఎంటి వింగ్  విభాగంలో  హెడ్ కానిస్టేబుల్  వీరభద్రం  విధులు నిర్వహిస్తున్నారు. సిఐ చెన్నూరి శ్రీనివాస్ సహాయ సహకారం, ప్రోద్భలంతో వీరభద్రం రాష్ట్ర స్థాయిలో రాణించి ఈ నెల 31 నుండి ఫిబ్రవరి3 వరకు కేరళలోని తిరుతిలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి