వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షునిగా పెద్దిటి దామోదర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

On
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

Screenshot_20250215_203502~2
అధ్యక్షులను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ అవినీతిని కళ్ళకు కట్టినట్లుగా నిరూపిస్తూ జర్నలిజంలో తమకంటూ ప్రత్యేక పాత్ర నిరూపించుకున్న జర్నలిస్టులు ఒక ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన పెద్దింటి దామోదర్ రెడ్డి (నమస్తే తెలంగాణ)ని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన వలిగొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో గౌరవ అధ్యక్షునిగా శివనాధుల రమేష్ (సాక్షి ),ఉపాధ్యక్షులుగా ఎమ్మే బాలరాజ్ (వార్త )గన్నేబోయిన నరసింహ (ప్రజా దర్బార్) ప్రధాన కార్యదర్శిగా డోగిపర్తి సంతోష్ (సూర్య వెలుగు) కోశాధికారి రాపోలు పవన్ కుమార్ (వాస్తవం) సహాయ కార్యదర్శిగా కట్ట శ్రీనివాస్ (దిశ) సలహాదారులుగా గోద అచ్చయ్య (నేటి వాస్తవాలు) ఆలకుంట్ల కృష్ణ (వార్తా వేదిక సూర్య )తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన పెద్దింటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు,జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని ,తనను ఎంతో నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కదిరేని సురేష్ ,దేశీరెడ్డి వెంకట్ రెడ్డి, ఎల్లంకి రాజు, ఎర్ర శ్రీకాంత్, సుక్క గణేష్, పల్లెర్ల సుధాకర్, వడ్డేమాన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 317

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం