ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

On
ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 28 : కొత్తగూడెం పట్టణం పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్ ఏసీబీ అధికారుల మెరుపు దాడిలో శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల  ఆత్మ రక్షణ కోసం కరాట శిక్షణ కోసం పథకానికి ప్రవేశ పెట్టగా, దానికి సంబంధించిన 72 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు నెలల పరిధికి 30000 రూపాయలు ప్రభుత్వం కరాటే ఇంస్రక్టర్కు అందిస్తుంది. దానిలో నుంచి 20000 లంచం డిమాండ్ చేయగా. కరాటే ఇంస్రక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా, శుక్రవారం కూలి లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ తాటి రవీందర్ 20000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా   పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని , తెలిపిన వారు వివరాలు గోపియంగా ఉంచుతామని ఏసిబి డిఎస్పి తెలిపారు.

Views: 513
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం.. మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్.. రంగారెడ్డి జిల్లా, యాచారం,...
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి