ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

On
ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 28 : కొత్తగూడెం పట్టణం పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్ ఏసీబీ అధికారుల మెరుపు దాడిలో శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల  ఆత్మ రక్షణ కోసం కరాట శిక్షణ కోసం పథకానికి ప్రవేశ పెట్టగా, దానికి సంబంధించిన 72 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు నెలల పరిధికి 30000 రూపాయలు ప్రభుత్వం కరాటే ఇంస్రక్టర్కు అందిస్తుంది. దానిలో నుంచి 20000 లంచం డిమాండ్ చేయగా. కరాటే ఇంస్రక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా, శుక్రవారం కూలి లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ తాటి రవీందర్ 20000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా   పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని , తెలిపిన వారు వివరాలు గోపియంగా ఉంచుతామని ఏసిబి డిఎస్పి తెలిపారు.

Views: 497
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక