మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

- మేకడోన గ్రామంలో మహిళపై తప్పుగా ప్రవర్తించిన వ్యక్తిపై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు.

On
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి 11 :- మండల పరిధిలోని మేకడోనా గ్రామంలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని మేకడోనా గ్రామంలో మార్చి 07-03-2025వ తేదీన ఉదయం బాధితురాలు మాదిగ భాగ్యమ్మ అదే గ్రామానికి చెందిన ఈడిగ నరసప్ప గౌడ్ యొక్క పొలంలో కూలి పనికి వెళ్ళింది. అయితే బాధితురాలు భాగ్యమ్మ నిళ్ళు త్రాగడానికి పొలంలోని వాటర్ ట్యాంకు దగ్గరకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వడ్ల నజీర్ అనే వ్యక్తి బాధితురాలు భాగ్యమ్మను చేయి పట్టికొని ఆమె కొంగును లాగాడని, జరిగిన ఈ సంఘటనను ఆమె ఇంట్లో బాధపడుతూ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే బాధితురాలు భాగ్యమ్మ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు 11-03-2025 వ తేది మంగళవారం పెద్దకడుబూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వడ్ల నజీర్ పై ఫిర్యాదు చేసారు. బాధితురాలు భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గొర్రెల కాపరి వడ్ల నజీర్ పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మహిళలపై ఇలా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులకు కఠినంగా శిక్ష పడేటట్లు చేస్తామని ఎస్ఐ తెలిపారు...IMG_20250311_213354

Views: 42
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక