పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన: ఇటికల గోవర్ధన్ రెడ్డి

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి...

On
పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన: ఇటికల గోవర్ధన్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన: ఇటికల గోవర్ధన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, మార్చి 19 (న్యూస్ ఇండియా ప్రతినిధి): మంచాల మండల పరిధిలోని తన సొంత గ్రామం రంగాపూర్  ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, అవసరమైన సామాగ్రిని MNR యువసేన టీమ్ సభ్యులు ఇటికల గోవర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు, చదువుతూ ఏదైనా సాధించగలమని, చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని

IMG-20250319-WA0674
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మెటీరియల్ అందజేస్తున్న గోవర్ధన్ రెడ్డి..

కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 46

About The Author

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..