‘శభాష్’ అక్షయ, ఇంటర్ లో 977/1000 మార్కులు.

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

On
‘శభాష్’ అక్షయ, ఇంటర్ లో 977/1000 మార్కులు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 24, న్యూస్ ఇండియా : ఇటీవల విడుదలైన ఫలితాలలో 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన మంగలి అక్షయను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అభినందించారు.
పటాన్చెరువు మండలం ముత్తంగి లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి పూర్తిచేసి సంగారెడ్డిలో నిరుపేద కుటుంబానికి చెందిన మంగలి పద్మ శ్రీశైలం దంపతుల అక్షయ ఇంటర్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్షయను కలెక్టర్ క్యాంప్  కార్యాలయంలో అభినందించి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అక్షయకు కలెక్టర్ / డాక్టర్  కావాలని సూచించారు. ఈ సందర్భంగా అక్షయ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఫలితాలలో 977 మార్కులు రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ మార్కులు రావడానికి లెక్చరర్లు, ప్రిన్సిపల్ కృషి చేసినట్లు తెలిపారు. ఇంటి కి దూరంగా ఉన్న పట్టుదలతో చదువుకున్నట్లు తెలిపారు.  భవిష్యత్తులో డాక్టర్ కావాలని అనుకుంటున్నాట్లు ఎంబిబిఎస్ చదవడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం యువత ప్రధాన కార్యదర్శి రాము యువత అధ్యక్షుడు ఆంజనేయులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-24 at 6.05.40 PM

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత