రేపు గుజరాత్ దంగల్

On

గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు డిసెంబర్‌ ఒకటిన జరగనున్నాయి. గురువారం 89 స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి దశలో మోర్బి, కచ్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, జునాగఢ్‌ వంటి స్థానాలు ఉండటంతో ఆసక్తి రేగుతోంది. 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్‌లో 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి. ఆప్‌ 88 స్థానాల్లో తమ […]

గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు డిసెంబర్‌ ఒకటిన జరగనున్నాయి.

గురువారం 89 స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తొలి దశలో మోర్బి, కచ్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, జునాగఢ్‌ వంటి స్థానాలు ఉండటంతో ఆసక్తి రేగుతోంది. 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్‌లో 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తొలి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి.

ఆప్‌ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.

బీఎస్పీ 57 మంది అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ ఆరుగురు అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపింది.

చివరి రోజున బీజేపీ దాదాపు 160 ప్రాంతాల్లో పబ్లిక్‌ మీటింగ్స్ నిర్వహించింది. మూడు జిల్లాల్లో కేంద్రమంత్రులు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News