మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

On

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు వివిధ […]

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి.

చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది.

చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు.

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది ఫాస్టర్స్‌ అందుబాటులో ఉండనున్నారు..

ఈ రోజు రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచి ఉంటుందని నిర్వహాకులు తెలిపారు.ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్‌ వేడుకకు మెదక్‌ చర్చి ముస్తాబవుతున్నది.

తినుబండారాలు, దుస్తులు, ఆటవస్తువులతో పాటు పలురకాల దుకాణాలు వెలిశాయి.

మరోపక్క రంగుల రాట్నాలు, బైక్‌లు, చిన్నచిన్న రైళ్లు చిన్న పిల్లలకు కనువిందు చేయనున్నాయి. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్‌ బొమ్మ ఆకట్టుకుంటున్నది.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..