బిఆర్ఎస్ లో చేరిన ఎన్ ఆర్ ఐ
ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన పాకనాటి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఈదురు ఐలయ్య, శ్రీరాం సుధీర్, ముత్తినేని శ్రీను, కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List