బి అర్ ఎస్ లోకి భారీ చేరికలు

*గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి!!*

బి అర్ ఎస్ లోకి భారీ చేరికలు

IMG-20230923-WA0074

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అయిత ఉప్పలయ్య, మాజీ వార్డు సభ్యులు గూడపల్లి మల్లయ్య, అయిత శంకర్, అంబేద్కర్ కాలనీ కుల పెద్ద పేరని యాకయ్య, గౌరీ సాయిలు తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారంతా బి.ఆర్.ఎస్ లో చేరారు. 

ఈ సంధర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అయి ఇతర పార్టీల నుండి భారీగా బి అర్ ఎస్ లోకి చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము బి అర్ ఎస్ లో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం పని చేస్తామని చెప్పారు. 

Read More ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక

ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ మండల నాయకులు, పార్టీ బాధ్యులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

Views: 75
Tags:

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం