బి అర్ ఎస్ లోకి భారీ చేరికలు

*గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి!!*

బి అర్ ఎస్ లోకి భారీ చేరికలు

IMG-20230923-WA0074

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అయిత ఉప్పలయ్య, మాజీ వార్డు సభ్యులు గూడపల్లి మల్లయ్య, అయిత శంకర్, అంబేద్కర్ కాలనీ కుల పెద్ద పేరని యాకయ్య, గౌరీ సాయిలు తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారంతా బి.ఆర్.ఎస్ లో చేరారు. 

ఈ సంధర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అయి ఇతర పార్టీల నుండి భారీగా బి అర్ ఎస్ లోకి చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము బి అర్ ఎస్ లో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం పని చేస్తామని చెప్పారు. 

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ మండల నాయకులు, పార్టీ బాధ్యులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

Views: 75
Tags:

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..