నూతనంగా ఏర్పడిన మెడికల్ కాలేజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేరు పెట్టాలి
జిల్లా కలెక్టర్ కి మెమోరాన్ని ఇచ్చిన పద్మశాలి కుల సంఘ నాయకులు
On
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు దివంగత శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం కోసం ఈరోజు జిల్లా పాలనాధికారికి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. క్యూట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆసిఫాబాద్ నియోజవర్గం తొలి శాసనసభ్యుడు. చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలంలో జన్మించిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలని పద్మశాలి కుల బంధువులు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా కమిటీ సభ్యులు,మండల కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు,యువజన కమిటీ సభ్యులు,కమిటీ సభ్యులు, మరియు కుల బాంధవులు పాల్గొనడం జరిగింది.
Views: 208
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
22 Mar 2026 09:40:27
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం తోర్రూర్ సీఐ
మండలంలోని వెలికట్ట గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక...

Comment List