ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష...
On
బేస్తవారిపేట న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష్యా కార్యక్రమంలో ప్రతి గృహాన్ని సందర్శించినట్లు వైద్యులు పృధ్వీ రాజు తెలిపారు.ఈ సందర్భంగా పృధ్వీ రాజు మాట్లాడుతూ కార్యక్రమం లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని స్థానికులను దర్శించి వారి ఆరోగ్యరీత్యా తగిన పరీక్షలు నిర్వహించారన్నారు.మెరుగైన చికిత్స అవసరం కల్గిన వారిని మెడికల్ క్యాంప్ లో హాజరు కావాలని టోకెన్లు అందజేసినట్లు తెలిపారు.అలానే ఈ కార్యక్రమం ఎం.ఎల్.హెచ్.పి ల ఆధ్వర్యంలో కమిటీ గా ఏర్పడి మండల ఆరోగ్య కేంద్రం పరిధిలోని గృహాలననింటిని సందర్శించటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.హెచ్.పి సర్దార్, ప్రతిమ, ఎంపిహెచ్ఏ ఎం.వెంకటేశ్వర్లు, కాశీ విశ్వనాథ రావు, అబ్దుల్లా, సచివాలయం ఏ.ఎన్.ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు.
Views: 191
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 20:10:00
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి(ఉపేందర్)
ఖమ్మం రఘునాథపాలెం మండలం రాంక్య తండా గ్రామపంచాయతీ లో సర్పంచ్ పదవికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు మూర్తి...

Comment List