సబ్బండ కులాల సంక్షేమం కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం*
*రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కిషోర్ రెడ్డి*
మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ కు చెందిన పోలేపల్లి రమేష్ ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బందు పథకానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అర్హుడుగా గుర్తించి బిసి బంధు పథకాన్ని లక్ష రూపాయల చెక్కును విడుదల చేయగా శనివారం రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ మెంబర్ రామసహయ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి రమేష్ కి చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ కులాల సంక్షేమం కేవలం బీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ చేతి వృత్తుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీలను ఆదుకోవడం జరుగుతుందని తెలుపుతూ ఈ పథకం ద్వారా మధ్యతరగతి బీసీ కుటుంబాలు కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడునని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేర్పుల ఆమని ఐలయ్య,ఉప సర్పంచ్ రామలింగం,మాజీ ఉప సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ పార్టీనాయకులు అనిల్ రెడ్డి,రెడ్యా,కిషన్, సోమేశ్,రవి మరియు చందు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List