అన్నదాన కార్యక్రమం

బాసపంగు భాస్కర్ సహకారంతో

అన్నదాన కార్యక్రమం

IMG_20230928_211910న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 29. పనుమటి సైదులు అడ్డగుడూరు మండల రిపోర్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో బస్టాండు వద్ద వినాయకుని మండపంలో బాసపంగు భాస్కర్,ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమం గూర్చి చరవాణిలో చెరుకు వెంకన్న, తెలుపగా వెంటనే స్పందించి అన్నదాన కార్యక్రమం అయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తానని వెంటనే స్పందించి 20వేల రూపాయలు తక్షణంగా ఫోన్ పే ద్వారా చెల్లించి తను సకాలంలో అందక పోయినప్పటికీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. మాద సోమరాజు దంపతులు మాసిరెడ్డి పల్లె గ్రామం దంపతులు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ నాయకులు యువజన సంఘాల నాయకులు బాసపంగు భాస్కర్,గూర్చి తెలుసుకొని గ్రామస్తులు అభినందించారు. ఈకార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుకునూరు సురేందర్ రెడ్డి,నారబోయిన కృష్ణ,(వార్డ్ మెంబర్) నూకల నరసయ్య మంజుల దంపతులు,నూకల సోమేశ్,నూకల రాంబాబు,పలుచం నరసయ్య, పోగుల యాదగిరి,పోతుగంటి యాదయ్య,గ్రామ దుర్గామాత కమిటీ సభ్యులు చేయూతనిచ్చారు.యువజన నాయకులు గ్రామస్తులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

Views: 57
Tags:

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..