ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీపై శనగపప్పు విక్రయం

శనగ పప్పు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో..

By Venkat
On
ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీపై శనగపప్పు విక్రయం

ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పంపిణీ

న్యూస్ ఇండియా తెలుగు:ప్రతినిధి 
హైదరాబాద్‌
శనగ పప్పు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పప్పును విక్రయించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ బాధ్యతలను హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం,హాకా,కు అప్పగించింది…
భారత్‌ దాల్‌’ పేరిట అక్టోబర్ 1తేది నుఁడి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనిద్వారా 50 వేల టన్నుల శనగపప్పును హాకా రాష్ట్రంలో విక్రయించనుంది. శనగ నిల్వలు భారీగా ఉండడంతో మొదటిదశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించేందుకు వీలుగా కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది.
దీనికోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలను పరిశీలించింది.తెలంగాణలో హాకాకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 18 రాష్ట్రాల్లో 5000 సంచార వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టనుండగా.. తెలంగాణలో 200 ఆటోల ద్వారా విక్రయించనున్నారు. ఈ పథకం కింద శనగపప్పు కిలో విడిగా రూ.60కి విక్రయిస్తారు.
30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది. వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖలకు విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది.
దీంతోపాటు ప్రభుత్వేతర సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, షాపింగ్‌ మాల్స్‌, ఇ-కామర్స్‌ సంస్థలు, ఆసుపత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం 30 కేజీల సంచులను విక్రయించనున్నారు.
సాధారణ శనగపప్పును మార్కెట్‌లో కిలో రూ.90కి విక్రయిస్తుండగా సబ్సిడీ పథకం ద్వారా విక్రయించే భారత్‌ దాల్‌ రూ.60కి లభించనుండటంతో కిలోకి రూ.30 మేర ఆదా అవుతుందిIMG-20230930-WA0197

Views: 85
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. నేనావాత్ నరసింహ నాయక్.. ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్.. రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్...
యాత్ర దానం ???
నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్