బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు అందవేత

On
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

పరామర్శిస్తున్న మాజి సర్పంచ్ రాజు నాయక్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన మూలి సుగుణమ్మ, గోపాల్ దంపతుల కుమార్తె మూలి కల్పన అనారోగ్యానికి గత కొన్ని రోజుల క్రితం నగరం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ రాజునాయక్, ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో కల్పనను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పూర్తిగా కోలుకునేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం సహాయం చేసిన రాజునాయక్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ తెలుగుమళ్ళ ప్రవీణ్, కొండాపురం శ్రీశైలం,యంజాల చంద్రకాంత్, కొంగరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Views: 35
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News