అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు
స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
By Venkat
On
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు
అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
రత్నగిరి కొండ పై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బి అర్ ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బి అర్ ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Views: 71
Tags:
About The Author
Post Comment
Latest News
31 Jan 2026 20:27:13
కొత్తగూడెం (న్యూస్ఇండియా) జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్- సిపిఐ పొత్తు చిత్తు అయిందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక...

Comment List