టీ.ఎస్.పి.ఎస్.సీ ని వెంటనే రద్దు చేయాలి..

చైర్మన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి..

On
టీ.ఎస్.పి.ఎస్.సీ ని వెంటనే రద్దు చేయాలి..

నిరుద్యోగులు విద్యార్థి యువకుల ఆత్మహత్యలకు కారణమైన టి.ఎస్.పి.ఎస్.సీ చైర్మన్, బోర్డు మెంబర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు సభ్యుల ను సస్పెండ్ చేయాలని, బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష పార్టీల..

ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ లో నిరుద్యోగులు విద్యార్థి యువకుల ఆత్మహత్యలకు కారణమైన టి.ఎస్.పి.ఎస్.సీ చైర్మన్, బోర్డు మెంబర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు సభ్యుల ను సస్పెండ్ చేయాలని, బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల

IMG-20231014-WA1125
ధర్నాలో పాల్గొన్న మిత్రపక్షాల నాయకులు, సీనియర్ నాయకులు

ఆధ్వర్యంలో సడక్ బంద్ కార్యక్రమంకు విజయవాడ  నేషనల్ హైవే హయత్ నగర్ హెచ్.డి.ఏప్.సి బ్యాంకు ఎదురుగా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రా చారి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి యువకులు తీవ్ర నిరాశతో ఉన్నారని  ఉద్యోగ కల్పన జాబ్ క్యాలెండర్ చేయకపోవడంతో  ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద మూడు లక్షలు ఇవ్వాలని, టి.ఎస్.పి.ఎస్.సి బోర్డు సంక్రమంగా పరీక్షలు నిర్వహించక పోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబానికి  50. లక్షల ఏక్సగ్రేషియాను చెల్లించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, బోర్డును రద్దు చేసి అర్హులైన సభ్యుల తోటి బోర్డు పునరుద్దరించి వేంటనే పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి,  సి.పి.ఐ.పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి  సామిడి శేఖర్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు అజ్మీర్ హరిసింగ్ నాయక్, దిగోజు వేణుగోపాల్, కేతరాజు నర్సింహా మరియు విద్యార్థి యువజన నాయకులు పోలోజు లక్ష్మణ్, సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, సక్రు నాయక్, నారాయణ రెడ్డి, లింగయ్య మహిళా నాయకులు, నవనీత, దేవమ్మ, సుభద్ర, సరిత అరుణ సుజాత పారిజాత తో పాటు వామ పక్ష నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్టు పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు.

Views: 69

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం