యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడి

On
యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే  అడుగులు

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే వడివడిగా అడుగులు వేస్తున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. సోమవారం లింగంపల్లి డివిజన్ బాపునగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ట్ టైల్స్,(మేన్స్ బోటిక్ )ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ కొందరు యువకులు అoదుకు భిన్నంగా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ.. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కూడా చూపించే విధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. యువత ఎప్పుడైతే స్వయం ఉపాధి వైపు ఆలోచించడం మొదలు పెడతారో వారి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతూ వస్తుందని వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు ఎంతో ప్రోత్సాహకంగా నిలుస్థాయి కానీ... ప్రభుత్వం స్వయం ఉపాధి చేసుకోవాలనే వారికీ సబ్సిడీ రుణాలు అందియడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమం షాప్ యజమాని కే ఏస్ రెడ్డి, నాయకులు రాములు గౌడ్,బేరి రాంచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఖమ్మం ఏప్రిల్ 10 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ భానోత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్