యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడి

On
యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే  అడుగులు

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే వడివడిగా అడుగులు వేస్తున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. సోమవారం లింగంపల్లి డివిజన్ బాపునగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ట్ టైల్స్,(మేన్స్ బోటిక్ )ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ కొందరు యువకులు అoదుకు భిన్నంగా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ.. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కూడా చూపించే విధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. యువత ఎప్పుడైతే స్వయం ఉపాధి వైపు ఆలోచించడం మొదలు పెడతారో వారి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతూ వస్తుందని వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు ఎంతో ప్రోత్సాహకంగా నిలుస్థాయి కానీ... ప్రభుత్వం స్వయం ఉపాధి చేసుకోవాలనే వారికీ సబ్సిడీ రుణాలు అందియడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమం షాప్ యజమాని కే ఏస్ రెడ్డి, నాయకులు రాములు గౌడ్,బేరి రాంచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

Views: 30
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి