యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడి

On
యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే  అడుగులు

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే వడివడిగా అడుగులు వేస్తున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. సోమవారం లింగంపల్లి డివిజన్ బాపునగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ట్ టైల్స్,(మేన్స్ బోటిక్ )ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ కొందరు యువకులు అoదుకు భిన్నంగా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ.. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కూడా చూపించే విధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. యువత ఎప్పుడైతే స్వయం ఉపాధి వైపు ఆలోచించడం మొదలు పెడతారో వారి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతూ వస్తుందని వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు ఎంతో ప్రోత్సాహకంగా నిలుస్థాయి కానీ... ప్రభుత్వం స్వయం ఉపాధి చేసుకోవాలనే వారికీ సబ్సిడీ రుణాలు అందియడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమం షాప్ యజమాని కే ఏస్ రెడ్డి, నాయకులు రాములు గౌడ్,బేరి రాంచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి! ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
ఇంటర్ ఎగ్జామ్స్.. సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి! రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24, న్యూస్ ఇండియా ప్రతినిధి: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వం...
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.
అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని