ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి  సింబల్ ఇవ్వకపోవడం 

By Venkat
On
ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 

 

       

తెలంగాణ ఎన్నికల్లోఅన్ని రాజకీయ పార్టీలకు సింబల్ ఇచ్చి ప్రజాశాంతి పార్టీకి గతంలో ఉన్న హెలికాప్టర్ సింబల్ ని ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లు అయినా ఉండాలని కొంతమంది అధికారులు చెప్పడం సరైంది కాదని జనసేన పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరని మరి ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలా ఇచ్చారో చెప్పాలని  గుర్తు చేశారు వైయస్ షర్మిల పార్టీకి   కూడా  సింబల్ ఇచ్చారని ఆమె అసలు పోటీ చేయడం లేదని గుర్తు చేశారు  ప్రజాస్వామ్యం పరంగా జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంబంధించిన హక్కులు ఉంటాయని వాటిని పక్కన పెట్టి ప్రజాశాంతి పార్టీ రాజకీయపరమైన వివక్ష చూపించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు 
ప్రశాంతి పార్టీ అసలు పోటీలోనే లేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసిన ఆడారి  ఎవరికి పోటీ లేనప్పుడు గుర్తు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు వీటి అన్నిటిపై అందరితో సమీక్షించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆడారి  తెలియజేశారు

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆపదలో ఆపన్నహస్తం....!! ఆపదలో ఆపన్నహస్తం....!!
ఆపదలో ఆపన్నహస్తం....!! టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ ఆర్థిక సహాయం అందించిన టీజీ...
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..