భారత సైనికులు ఓ నిండు గర్భిణిని ప్రాణాపాయం నుంచి రక్షించారు
కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి
On
ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని రక్షిత ప్రాంతానికి తరలించారు..
శనివారం రాత్రి 11 గంటల సమయంలో గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాలకు తరలించడం కష్టతరమైంది. ఈ సమయంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందించారు. 2 నుండి 3 అడుగుల లోతున ఉన్న మంచులో నడుస్తూ.. 7 నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను తరలించారు. అనంతరం వైద్యులు ఆమెను పరీక్షించి ప్రసవం చేశారు.
Views: 32
Tags:
About The Author
Post Comment
Latest News
11 Apr 2026 10:09:08
ఖమ్మం ఏప్రిల్ 10 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ భానోత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....

Comment List