సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

- మృతదేహాన్ని రప్పించాల్సిందిగా కోటపాటికి వినతి

On
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

ఇందూరు, ఫిబ్రవరి22, న్యూస్ ఇండియా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా గాంధారివాసి చాకలి పోశయ్య (48) సౌదీ అరేబియాలో రియాజ్ కు వెయ్యి  కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. గత అనేక సంవత్సరాలు  గా అక్కడే పని చేస్తున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి పది రోజుల క్రితం సౌదీ కి వెళ్ళిన పోశయ్య మనస్తాపంతో అతను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడే పని చేస్తున్న మరొక వ్యక్తి నిన్నటి రోజున సమాచారం ఇచ్చాడు. పోశయ్య కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని సంప్రదించి స్థానిక BRS నాయకులు H తానాజీ రావు ను సంప్రదించగా, వారు B. B పాటిల్ M. P గారిని సంప్రదించి, అనంతరం మృతదేహాన్ని తెప్పించవలసిందిగా " ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక " అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడుని అభ్యర్థించి, సహాయపడవలసిందిగా కోరారు. కుటుంబ సభ్యులను ఆర్మూర్ కు పంపి కావలసిన పత్రాలు సమర్పించారు.  వెంటనే స్పందించిన కోటపాటి అటు సౌదీలోని ఇండియన్ ఎంబసీ, ఇటు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ పంపారు. సౌదీలోని కమ్యూనిటీ కోఆర్డినేటర్ సయ్యద్ అబు ఫరస్ గారికి మృతదేహాన్ని పంపడానికి అధికారం ఇస్తూ నియమించడం జరిగింది. త్వరలోనే మృతదేహాన్ని పూర్తి ఖర్చులు భరించి యజమాని పంపే విధంగా చర్యలు తీసుకుంటామని ఇండియన్ ఎంబాసి రియాద్ నుండి జవాబు పొందడం జరిగింది.

Views: 217
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..