అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

11,20,000/- రూపాయలు విలువ గంజాయి స్వాదినం

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS


ఈరోజు అనగా తేదీ 20.07.2024 రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో  ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందితో  దుబ్బ తండ దగ్గర ఉదయం 9 గంటల సమయాన వాహనాలను తనిఖీ చేయగా, ఒక బొలెరో వాహనం అనుమానాస్పదంగా, స్పీడ్గా వస్తుండగా అట్టి వాహనాన్ని ఆపి, అందులోని నలుగురు (ఇద్దరు మగ & ఇద్దరు ఆడ మనుషులు) పారిపోయేందుకు ప్రయత్నం చేయగా, వెంటనే వారిని అధువులోకి తీసుకొని వారి బొలెరో వాహనం చెక్ చేయగా, అందులో వెనకాల మూడు ప్లాస్టిక్ సంచులలో నిండా 33 ప్యాకెట్ల గంజాయి లభించింది.

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా,

Read More వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...

1) ప్రహ్లాద్ సిసా, S/o జగబంధు సీసా, వయస్సు: 36 సంవత్సరాలు, ST-ఆదివాసి, R/O కాంతి గ్రామం, బాదెల్ పోస్ట్, పాడువ మండలం, కోరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

2) అప్పన్న బైరాగి, S/o Mngu బైరాగి, వయస్సు; 36 సంవత్సరాలు, కులం ST ఆదివాసి, బోక్ మెకానిక్, R/ ౦ కితుబా గ్రామం, బార్డేల్ పోస్ట్, కొరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

3) మిథులా సిసా, D/o సోను సినా, వయస్సు: 21 సంవత్సరాలు, R/O మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మాచ్ కుడా ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా.

4) బసౌతి పాంగి, D/o పడలం పాంగి, మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మచ్కుడ ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా. అని తెలపడం జరిగింది.గత ఇటీవల ప్రభుత్వ నిషేదిత గంజాయి వ్యాపారం చేస్తున్నాను,తరుచుగా ఒరిస్సా నుండి తెలంగాణ హైదరాబాదులో అమ్ముకుంటామని, అదే విధంగా ఈ రోజు కూడా గంజాయి ప్యాకెట్లను ఒడిస్సా నుండి తీసుకుని రాజమండ్రి విజయవాడ, కోదాడ సూర్యాపేట దంతాలపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

వీరి వద్ద మొత్తం గంజాయి సుమారుగా 60 కిలోల విలువ సుమారుగా రూ. 11,20,000/- రూపాయలు(Per Kg 20000/-) ఉంటుంది. గంజాయి తరలించడానికి వాడిన బొల్లెరో టర్బో బేరింగ్ నెం: AP39G3761 ను మరియు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకొని నిందితులను రిమాండుకు తరలించడం జరిగింది.

చాకచక్యం గా వ్యవహరించిన గంజాయి నిందితులను పట్టుకున్న ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.

మీడియా సమావేశంలో తొర్రుర్ సీఐ సంజీవ, ఎస్.ఐ జగదీష్, దంతాలపల్లి ఎస్.ఐ రాజు, ఎస్.ఐ క్రాంతి కిరణ్, సిబ్బంది ఉన్నారు.

Views: 168
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..