జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

On
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం రోజున జెఇ వ్యాక్సిన్ ను ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్ద అంబర్పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొని పిల్లలకు వ్యాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొమ్మిది నెలల పిల్లలు నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని అన్నారు. అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను పిల్లలకు వివరించారు, ఈ వ్యాక్సిన్ పై అందరికీ అవగాహన కల్పిస్తే ఈ మెదడువాకు వ్యాధి నుండి పిల్లలను కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ పర్వీన్, ఏఎన్ఎం  పద్మ ,రమాదేవి ,ఆశ వర్కర్ భాగ్యలక్ష్మి, జయలక్ష్మి పాల్గొనడం జరిగింది.

IMG-20240726-WA0029
పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్న సిస్టర్..
Views: 27

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..