జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

On
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం రోజున జెఇ వ్యాక్సిన్ ను ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్ద అంబర్పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొని పిల్లలకు వ్యాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొమ్మిది నెలల పిల్లలు నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని అన్నారు. అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను పిల్లలకు వివరించారు, ఈ వ్యాక్సిన్ పై అందరికీ అవగాహన కల్పిస్తే ఈ మెదడువాకు వ్యాధి నుండి పిల్లలను కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ పర్వీన్, ఏఎన్ఎం  పద్మ ,రమాదేవి ,ఆశ వర్కర్ భాగ్యలక్ష్మి, జయలక్ష్మి పాల్గొనడం జరిగింది.

IMG-20240726-WA0029
పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్న సిస్టర్..
Views: 44

About The Author

Post Comment

Comment List

Latest News

సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు సెంటర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..