విశ్వహిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు

On
విశ్వహిందూ  మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో) నవంబర్ 21:విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించినట్లుగా విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్, జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్,మహావీర్ కొరవి,అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు ఆని,కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యల మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరు కానున్నారని. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పైదా సోము, కుంజా నాగేంద్రబాబు,సిసింద్రీ,వీర్రాజు,వెంకటేష్,పైదా ప్రసాద్,రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్,బొర్రా నాగమణి,కుంజా భవాని,వాసం రాణి, వట్టం వినోద, ఎండీ రంజాన్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా? కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం (న్యూస్ఇండియా) జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో  కాంగ్రెస్- సిపిఐ  పొత్తు చిత్తు అయిందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక...
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్
24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 
స్థానిక యుద్దానికి మేం సిద్ధం