విశ్వహిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు

On
విశ్వహిందూ  మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో) నవంబర్ 21:విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించినట్లుగా విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్, జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్,మహావీర్ కొరవి,అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు ఆని,కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యల మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరు కానున్నారని. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పైదా సోము, కుంజా నాగేంద్రబాబు,సిసింద్రీ,వీర్రాజు,వెంకటేష్,పైదా ప్రసాద్,రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్,బొర్రా నాగమణి,కుంజా భవాని,వాసం రాణి, వట్టం వినోద, ఎండీ రంజాన్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.