అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

కొత్తగూడెం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో కూల్చివేత

On
అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) డిసెంబర్10:కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ స్థలాన్ని ఇటీవల ఒక కబ్జాదారుడు ఆక్రమించి నిర్మాణం చేసి షెడ్డును ఏర్పాటు చేసుకోగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు నిర్మాణం చేయడంపై కొంతమంది ప్రముఖులు అధికారులకు ఫిర్యాదు చేశారు .ఫిర్యాదులపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కలిసి పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు.ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు డిపో మేనేజర్ తో పాటు అధికారులు సిబ్బంది తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు సమర్థిస్తున్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా సహకరించిన వన్ టౌన్ పోలీసులకు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 243
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు ఇవే! వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు ఇవే!
ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలో ఆలోచిస్తున్నారా? భారతదేశంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. కోటలు, దేవాలయాలు, రాజప్రాసాదాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన...
తొర్రూరులోనే అత్యాధునిక లాప్రోస్కోపి శస్త్రచికిత్సలు నిర్మల హాస్పిటల్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థుల ఆందోళన..
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ