యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

On
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 22, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250223-WA0534
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి 'పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ' మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23, ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా గుట్టకు హాజరై మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పంచతుల బంగారు విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్ లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం.. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఏర్పాటు చేస్తున్న స్వర్ణ విమాన గోపురం దేశంలోనే అతి ఎత్తయిన ఏకైక స్వర్ణ విమాన గోపురం. దాదాపు 68 కిలోల బంగారంతో స్వర్ణతాపడం చేశారు. స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవంలో సీఎం తో పాటు సీఎస్ శాంతాకుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి