ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’

జీవితంలో మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చేదే ఫోటోగ్రఫీ -జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య

On
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’

WhatsApp Image 2025-08-19 at 3.33.15 PM
‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’ సందర్భంగా 'ఫోటోగ్రాఫర్ పవన్' ను సన్మానిస్తున్న అతిధులు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 19, న్యూస్ ఇండియా : మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ  భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య మాట్లాడుతూ...  గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఫోటోగ్రఫీ కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ ప్రతిబింబం, జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు. ఒక ఫోటో అనేది కేవలం చిత్రం మాత్రమే కాదు, అది సమాజంలోని అనేక కోణాలను  మనముందుంచుతుందని  అన్నారు. ఒకే ఫ్రేమ్‌లో భావాలను వ్యక్తపరచగల శక్తి ఫోటోగ్రఫీ కే ఉంది అన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలకు ఫోటో ఒక సజీవ సాక్ష్యం ఉంటుందని, కొత్త టెక్నాలజీ సహకారంతో ఈ కళ మరింత విస్తరించిందని, ప్రతి చిత్రంలో ఒక ఫ్యాషన్, ఒక సృజనాత్మకత ప్రతిఫలిస్తుందని తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లు నిర్వహించి, వారికి  ఫొటోగ్రఫీ లో మెలకువలు నేర్పి శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టి.జి.ఐ.ఐ.సి చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ... ఫోటోగ్రఫీ జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఒక ప్రత్యేకమైన సాధనం అని అన్నారు. ఒక ఫోటో మనసులను కదిలించే శక్తిని కలిగి ఉంటుందని, విపత్తుల సమయంలో బాధితుల పరిస్థితిని ప్రతిబింబించే చిత్రాలు ప్రజలలో స్పందన కలిగించి సహాయం అందించేందుకు ప్రేరేపిస్తాయి అని ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు, అది సమాజానికి అద్దం లాంటిదని, ప్రతి జ్ఞాపకాన్ని శాశ్వతం చేసే శక్తి ఫోటోకే ఉంది అని పేర్కొన్నారు. సిగాచి  పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద సమయంలో కార్మికులకు సహాయక చర్యలు అందించడంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యక్షంగా ఒక కార్మికురాలిగా పనిచేసి వారికి అండగా నిలిచారని టి.జి.ఐ.ఐ.సి చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భముగా గుర్తుచేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ...  ఫోటోగ్రఫీ అనేది ఒక విలువైన సామాజిక సాధనం. ఇది సమాజాన్ని కదిలించే   శక్తిని కలిగి ప్రతీ సంఘటనను చరిత్రలో నిలబెట్టే మహత్తరమైన పాత్ర పోషిస్తుందని, కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ మిళితంగా ఒక ఫోటో జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే శక్తిని కలిగి ఉందని అన్నారు. అంతకుముందు  జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీరు సందర్శించి, అక్కడ ప్రదర్శించిన చిత్రాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )చంద్రశేఖర్, టి జి ఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ ,టి యు డబ్లు జె  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్, టి యు డబ్లు జె జిల్లా అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు ఆరీఫ్, జనరల్ సెక్రిటర్ సత్యం, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు  , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-08-19 at 3.25.42 PM

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి
మహబూబాబాద్ జిల్లా:- ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా...
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..