కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..

On
కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం పథకాల, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్ లో డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరై  కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, ఉదయ రెడ్డి, డేరంగుల కృష్ణ, శివారెడ్డి ,నాగిరెడ్డి, సాయి, విజయ్, మహేష్ పాల్గొన్నారు.IMG-20230923-WA1478

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.