"కాంతితో క్రాంతి" కార్యక్రమంలో దాదా..

On

కంభం న్యూస్ ఇండియా

తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్ షేక్ హుస్సేన్ దాదా ఆధ్వర్యంలో తన స్వగృహం నందు ఘనంగా శాంతియుత నిరసన తెలిపారు.ఈ కార్యక్రమం లో తమ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడిపి అభిమానులు హాజరయ్యారు.ఇందులో భాగంగా విద్యుత్ దీపాలను ఆపి మొబైల్ ఫోన్ లైట్ లను వేస్తూ,కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.అలానే బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు పలికారు.ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ బాబు మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడిపి బయపడదు అని అన్నారు. బాబుపైన పెట్టినా కేసు అక్రమ కేసు అని ప్రజలు అందరూ నమ్ముతున్నారని త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు బయటకి వచ్చేవరకు ఇలాంటి శాంతియుత నిరసనలు మున్ముందు ఎన్నో జరుగుతాయని తెలిపారు.

IMG-20231007-WA0317
ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి దాదా
Views: 209

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆపదలో ఆపన్నహస్తం....!! ఆపదలో ఆపన్నహస్తం....!!
ఆపదలో ఆపన్నహస్తం....!! టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ ఆర్థిక సహాయం అందించిన టీజీ...
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..