"కాంతితో క్రాంతి" కార్యక్రమంలో దాదా..

On

కంభం న్యూస్ ఇండియా

తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్ షేక్ హుస్సేన్ దాదా ఆధ్వర్యంలో తన స్వగృహం నందు ఘనంగా శాంతియుత నిరసన తెలిపారు.ఈ కార్యక్రమం లో తమ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడిపి అభిమానులు హాజరయ్యారు.ఇందులో భాగంగా విద్యుత్ దీపాలను ఆపి మొబైల్ ఫోన్ లైట్ లను వేస్తూ,కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.అలానే బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు పలికారు.ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ బాబు మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడిపి బయపడదు అని అన్నారు. బాబుపైన పెట్టినా కేసు అక్రమ కేసు అని ప్రజలు అందరూ నమ్ముతున్నారని త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు బయటకి వచ్చేవరకు ఇలాంటి శాంతియుత నిరసనలు మున్ముందు ఎన్నో జరుగుతాయని తెలిపారు.

IMG-20231007-WA0317
ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి దాదా
Views: 204

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం