జూనియర్ కళాశాలలో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ ను తొలగించిన ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి.

On
జూనియర్ కళాశాలలో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ ను తొలగించిన ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి.

న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 09 :మహాబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కళాశాల క్లాస్ రూంలో ఉన్న ఫ్యాన్ల కలెక్షన్ ను తీపించిన కళాశాల ప్రిన్సిపల్ కోటేష్  పై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.... విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఒకవైపు కొట్లాడుతుంటే  దాన్ని పట్టించుకోకుండా  జూనియర్ కళాశాల క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ను  ప్రిన్సిపల్ తీపించడం సరికాదని అన్నారు. విద్యార్థులకు చదువుకోవడానికి కళాశాల రూమ్ కి 6 ఫ్యాన్లు కేటాయిస్తే అందులో కనీసం 3 ఫ్యాన్లు కూడా నడిపించకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి. జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు లేక కళాశాలలో ఉన్న నీటి ట్యాంకును శుభ్రం చేకపోవడం, బాత్రూంలో టాప్స్ సరిగా లేకపోవడం, లైబ్రరీ ఓపెన్ చేయకపోవడం, కాలేజీ ఆవరణలో దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు ఇబ్బంది పడడం, ఇన్ని సమస్య ఉన్నా కూడా కాలేజీ ప్రిన్సిపాల్ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరిస్తున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మండిపడ్డారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ కేటాయించాలని, యూనిఫామ్ సకాలంలో అందించాలని అన్నారు. తక్షణమే ఫ్యాన్ కలెక్షన్ను తొలగించిన కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరి చర్యలు తీసుకోని, ఫ్యాన్ కలెక్షన్ ని తక్షణమే వేయించాలని హెచ్చరించారు. లేనియెడల పిడిఎస్యు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, గణేష్, అరుణ్, దిలీప్, అనిల్, ముఖేష్, సాయి, వీరేష్, సంతోష్, సందీప్, జోహార్ లాల్, అరవింద్, దినేష్,  లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 39
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి