40 మంది పై బైండోవర్
సిఐ జుక్కల హన్మంతు
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రోజు కంగ్టి సర్కిల్ సిఐ జక్కల హన్మంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని అన్ని రికార్డులు పరిశీలించి పాత నేరస్థుల గురించి స్థానిక ఎస్సై మహిపాల్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా సిఐ జుక్కల హన్మంతు మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోడ్ భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ రాకలైన కేసులు ఉన్న నేరస్థుల ను శాంతి భద్రతలలో విఘతం కలుగుతుందని భావించి ముందస్తు చర్యలో భాగంగా 40 మంది పై బైండొవర్ కేసులు బుక్ చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Views: 215
Tags:

Comment List