జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

By Khasim
On
జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందిందని ప్రజలందరూ జగన్ అన్నకు అండగా నిలవాలని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ అన్నారు. హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, పెద్ద గొల్లపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దద్దాల నారాయణ యాదవ్ కు హనుమంతునిపాడు మండలం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను నేరుగా అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ దద్దాల నారాయణ యాదవ్ ను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బాలరామి రెడ్డి, మండల కన్వీనర్ ఎక్కంటి శ్రీనివాసుల రెడ్డి, భవనం కృష్ణా రెడ్డి, మద్ది తిరుపతయ్య, గురుప్రసాద్, బాలాజీ, మండల మహిళా అధ్యక్షులు బేబీ, వైస్ ఎంపీపీ శోభా రాణి,సాంబిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 12:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల...
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన