బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

ముకుమ్మడిగా పార్టీ మారనున్న 20 మాజీ సర్పంచులు...

On
బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

gram_pachayattte21dd9a582d163e8dd15ffd70b582e55పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంగ్టి మండల రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా పాడిన బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న కొద్దో గొప్పో క్యాడర్ ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని లోకల్ లీడర్స్ పార్టీ నియోజకవర్గ నాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని వినికిడి. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామ అధ్యక్షులు , సుమారు 18 నుండి 20 మంది మాజీ సర్పంచులు , నలుగురు ఎంపీటీసీలు , మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు చేరికను గుట్టుచప్పుడు కాకుండా అపర్సషన్ ఆకర్ష్ ను కంగ్టి మండల నికి చెందిన ఒక వ్యక్తి కనుసన్నల్లో జరుగుతున్నట్టు సమాచారం. రేపు మండల కేంద్రంలో జరగబోయే బీజేపీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ , పార్లమెంట్ ఇంచార్జి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Views: 196
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి