ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కొరకు దరఖాస్తుల స్వీకరణ.
On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కొరకు దరఖాస్తుల స్వీకరణ.
.
ఎల్బీనగర్, జూన్ 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరం కొరకు సంస్కృతం-1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్-2, స్టాటిస్టిక్స్-1 మొత్తం 3 సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకం చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. జ్యోత్స్నప్రభ తెలియజేశారు. సంబంధిత పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. సంబంధిత సబ్జెక్టులో నెట్, స్లెట్, సెట్, పిహెచ్.డి. ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అలాగే ఇంతకుముందు డిగ్రీ కళాశాలలో బోధనానుభవం ఉన్నవారు సర్వీస్ సర్టిఫికెట్ జతచేయగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ 01.07.2024 సాయంత్రం వరకు కళాశాలలో తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.
Views: 17
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 22:38:06
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...

Comment List