నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు

On
నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు

*నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు*

జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రాం అధికారి కమరతపు భానుచందర్ ప్రోత్సాహంతో  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికలు), ఖమ్మం నందు జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ శ్రీ టి రవికుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ శ్రీ శ్రీనివాస రావు, సీఎంఓ శ్రీ రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఝాన్సీ మరియు నెహ్రు యువ కేంద్ర అధికారి భానుచందర్, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత అత్యున్నత స్థానానికి ఎదగాలని, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం సగటు భారతీయ పౌరుడి బాధ్యత అని ముఖ్య అతిధులు యువతకు సందేశం ఇచ్చారు. జిల్లాస్థాయిఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి యాడ లావణ్య 'స్వామి వివేకానంద జీవితం' పై ఉపన్యాసం ఇచ్చారు. యువతని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన వీడియోను లైవ్ లో ముఖ్య అతిథులతో పాటు యువత కూడా వీక్షించారు. తదుపరి రోడ్డు భద్రత అవగాహన కోసం యువత ప్లక్కాడ్ లతో మరియు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని ట్రాఫిక్ ఎస్ఐ టి రవికుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులతో పాటు కోవెల శ్రీయుత అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ఎన్వికె వాలంటీర్లు మనస్విని, మరియు ఖమ్మం ట్రాఫిక్ సిబ్బంది మదార్, జమాల్,అనిల్, అక్రమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్  ఝాన్సీ గారికి మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీమతి లీలా గారికి నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ధన్యవాదాలు తెలిపింది.

Views: 74
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు