గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

On
గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

IMG-20240701-WA0109
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

ఇబ్రహీంపట్నం, జులై 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. సోమవారం రోజున సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చర్లపటేల్ గూడ, తుర్కగూడ, కప్ప పహాడ్ గ్రామాలలో ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు సుమారు 47.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, సమస్యలు లేని గ్రామాలుగా తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, ఈసి. శేఖర్ గౌడ్, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ మహిపాల్, పిఎసిఎస్ చైర్మన్ ఎద్దుల పాండురంగ రెడ్డి, గురునాథ్ రెడ్డి, జడల రవీందర్ రెడ్డి, కోడూరి రమేష్, మాజీ ఉప సర్పంచ్ నరేందర్, మునీర్, ఎంపీటీసీ ఆంజనేయులు, రాఘవేందర్, వివిధ గ్రామ పెద్దలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 23

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్