గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

On
గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి..

IMG-20240701-WA0109
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

ఇబ్రహీంపట్నం, జులై 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. సోమవారం రోజున సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చర్లపటేల్ గూడ, తుర్కగూడ, కప్ప పహాడ్ గ్రామాలలో ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు సుమారు 47.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, సమస్యలు లేని గ్రామాలుగా తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, ఈసి. శేఖర్ గౌడ్, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ మహిపాల్, పిఎసిఎస్ చైర్మన్ ఎద్దుల పాండురంగ రెడ్డి, గురునాథ్ రెడ్డి, జడల రవీందర్ రెడ్డి, కోడూరి రమేష్, మాజీ ఉప సర్పంచ్ నరేందర్, మునీర్, ఎంపీటీసీ ఆంజనేయులు, రాఘవేందర్, వివిధ గ్రామ పెద్దలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 22

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*