రామచంద్రభారతిపై మరో కేసు

On

Case Against Ramachandra :ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన “తెరాస ఎమ్మెల్యేలకు ఎర” కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు […]

Case Against Ramachandra :ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన “తెరాస ఎమ్మెల్యేలకు ఎర” కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది.

నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత నెల 26న రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు… పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Read More తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

దిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read More బిఆర్ఎస్ కు బై బై... కాంగ్రెస్ కు జై జై...

హైదరాబాద్​కు చెందిన నందకుమార్ సాయంతో పైలెట్ రోహిత్ రెడ్డిని పరిచయం చేసుకొని ఆయన ద్వారా తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలోనూ రామచంద్ర భారతి మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల గురించి ప్రస్తావించారు.

Read More రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ