ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
పంచాయతీ రాజ్ శాఖ చేతివాటం!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, పెద్దచెల్మెడ గ్రామం లో ‘ఏసీ 55 మెగావాట్లు, డిసి 65 మెగావాట్లు కెపాసిటీ కలిగి, దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడి ఉండి పేరు ప్రఖ్యాతులు గాంచిన సోలార్ పవర్ ప్లాంట్ ప్రత్యేక్యత జిల్లా ప్రజలకు విదితమే. ఏదేమైనప్పటికీ ఈ సంస్థద్వారా పంచాయతీ / ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావలసిన సొమ్ము బకాయిలు భారీ మొత్తంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. పన్నుల రూపంలో రావలసిన భారీ మొత్తానికి కొంత మంది అక్రమార్కులు ఒక చీకటి ప్రణాళిక రచించినట్టు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. గత 8 సవత్సరాలను నుండి ఈ సోలార్ సంస్థ ప్రభుత్వనికి పన్నులు బాకి పడినట్టు తెలుస్తుంది. సంబంధిత నోటీసులు జారీఅయినట్టు సమాచారం. చట్టం ప్రకారం నియమ నిబంధనలకు లోబడి పన్నులు చెల్లిస్తే భారీగా సొమ్ము చెల్లించవలసి వస్తుంది. కాబట్టి వక్రమార్గంలో ఆలోచన చేస్తే 'స్వామి కార్యము స్వకార్యము' అనే చందంగా పరిష్కారం లభించి సంబంధిత అధికారులు కూడా లాభపడొచ్చు అనే ఓక పరస్పర అవగాహనకు వచ్చినట్టునట్టు గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కట్టడి చెయ్యాలని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.
Comment List