పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
- యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు మన అధీనంలో ఉంటాయి... యోగా ఆసనాలు మనుషుల వ్యాధులకు నివారణ...
- కార్యక్రమంలో యోగా ఆసనాలతో నరవ దంపతులు ప్రదర్శన...
న్యూస్ ఇండియా ప్రతినిధి / పెద్దకడుబూరు మండలం జూన్ 21 :- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలరోజుల పాటు యోగాంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం పెద్దకడుబూరు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్పెషల్ అధికారి పర్యవేక్షణలో మరియు మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు, గ్రామ ప్రజలందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మరియు టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రామాకాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి నరవ శశిరేఖ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవనం కోసం ప్రజలందరూ కూడా యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరం మనస్సు మన అధీనం లో ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వం యోగా ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ, ఎంపీడిఓ, ఎంఈఓ మరియు ఇతర అధికారులు ప్రజలు, విద్యార్థులు, కూటమి పార్టీ కార్యకర్తలు, వీరామహిళలు పాల్గొన్నారు...
Comment List