కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నా

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నా

*కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నాIMG_20240316_123448 *

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు.ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ముందు ఈడి తరువాత మోడీ అనుకుంటూ నినాదాలు చేశారు.ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదన్నారు.అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని. న్యాయ పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.అదేవిధంగా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని ఎర్రబెల్లి తెలిపారు.కేసీఆర్‌‌ డిమోరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయిని అరెస్టులు బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా,న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు మూడు రోజులు వాయిదా వేసిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా మహిళల్ని సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు, దాడులు జరిగాయని.. రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Views: 69
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....