అటవీ జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డ ఆరుగురు వేటగాళ్లు

వేటగాళ్ల నుండి బలమైన మారణ ఆయుధాలు స్వాధీనం

On
అటవీ జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డ ఆరుగురు వేటగాళ్లు

గన్ను, కత్తి, గొడ్డలి, బుల్లెట్,

IMG-20240407-WA0420కారుతో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం 

కేసు నమోదు చేసి కోర్టుకు తరలింపు 

తల్లాడలో విలేకరుల సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

అటవీ జంతువులను వేటాడుతుండగా కొంతమంది వేటగాళ్ళను కాపు కాసి పట్టుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడలో డీఎఫ్ వో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లాడ రేంజర్ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో  శనివారం రాత్రి కొంతమంది వేటగాళ్లు జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డారని వివరించారు. ఉన్నతాధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు బెండలపాడు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో జిల్లా, తల్లాడ రేంజ్ పరిధిలో అధికారులు ఆ వేటగాళ్ళ కోసం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రకు చెందిన హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు వేటగాళ్లతోపాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన పుష్పాల సుగ్రీవు, వెంకట శ్రీకాంత్, బొడ్డన నారాయణరావు, తినురం విజయ్ నాగరాజు  తో పాటు స్థానికులు డేరంగుల మిధున్ కుమార్, బొర్రా సురేష్ లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి గన్ను, కత్తి, మల్టిపుల్ గొడ్డలి, బుల్లెట్, కారు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, చిరుత పులి తదితర అటవీ జంతువులు ఉంటాయని, వాటిని వేటాడేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరికి మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లు వస్తున్నారనే సమాచారంతో శని, ఆదివారాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేయటం జరుగుతుందని తెలిపారు. లోకల్ గా ఉండే వారు కాకుండా హైదరాబాదు నుండి వేటగాళ్లు వస్తున్నారని వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ కూడా వన్యప్రాణులను వేటాడవద్దని సూచించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రేంజర్ లావణ్య, డిఆర్ఓ కెవి రామారావు, తల్లాడ రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

Views: 108
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్