ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలి

వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ఫతేపురం గ్రామంలో గల స్థానిక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో సీలర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటడం జరిగింది. తదనంతరం ఎంపీడీవో సీలార్ సాబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మానవ మనుగడకు చెట్లు చాలా అవసరమని తెలుపుతూ దేశం మరియు రాష్ట్రం సాంకేతిక పరంగా దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా దేశంలో కాలుష్యం పెరిగిపోతుందని దీనివల్ల ప్రజలు అనారోగ్యాలకు కారణం అవుతున్నారని పేర్కొంటూ కాలుష్య నివారణకు చెట్లను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే తరం పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్న చెట్లు చాలా అవసరం అంటూ ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా పిల్లలకు అలవాటు చేయాలన్నారు.మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు. కాలుష్య రహిత నియోజవర్గం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలలో బాధ్యతగా మొక్కలు నాటాలని గ్రామ ప్రజలకు,యువతకు మరియు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్,ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, పంచాయతీరాజ్ రాష్ట్ర రూరల్  డెవలప్మెంట్ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 100
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..