టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్

On
టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్

న్యూస్ ఇండియా (టేక్మాల్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 6) మెదక్ జిల్లా టేక్మాల్ మండల ఎస్సైగా రాజేష్ బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలో ఇక్కడ పనిచేసిన ఎస్సై మురళి మెదక్ రూరల్ బదిలీ అయ్యారు. మెదక్ ఏఆర్ లో ఉన్న రాజేష్ బదిలీపై టేక్మాల్ కు వచ్చారు. గురువారం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైన ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలి తప్ప దాడులకు పాల్పడకూడదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్షకు గురవుతారని చెప్పారు. రానున్న వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గ్రామాల్లో శాంతిసామరస్యం నెలకొనాలని, ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని సూచించారు.

Views: 11

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..