మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత మృతి

On
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత మృతి

న్యూస్ ఇండియా (హైద్రాబాద్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 10) బీఆర్ఎస్ నేత, టి జి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత మరణించారు. కొద్దిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో రాత్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కొద్ది గంటల వ్యవధిలో కన్నుమూశారామె. దీంతో లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం అలముకుంది. హోమియోపతి డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే లక్ష్మారెడ్డి భార్య చనిపోయారు. డాక్టర్ శ్వేత మరణం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్