కొత్తగూడెం జిఎం ఆఫీస్ వద్ద బిఎంఎస్ ధర్నా

ఏరియా ఉపాధ్యక్షులు మొగిలిపాక రవి ఆధ్వర్యంలో కార్యక్రమం

On
 కొత్తగూడెం జిఎం ఆఫీస్ వద్ద బిఎంఎస్ ధర్నా

కొత్తగూడెం (న్యూస్ఇండియాబ్యూరోనరేష్) సెప్టెంబర్ 26: భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళన లో భాగంగా కొత్తగూడెం ఏరియా IMG-20240926-WA1316 ఉప అధ్యక్షులు  మొగిలిపాక రవి అధ్యక్షతన కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి ఎస్ పవన్ కుమార్, ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగాా వారు  మాట్లాడుతూ సి ఎం పి ఎఫ్ లో జరిగిన అవినీతి పైన సి బి ఐ తో విచారణ జరిపించి దోషుల ను కనుగొని కార్మికుల కష్టపడ్డ సొమ్ము ను మొత్తము రికవరి చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి ప్రకటించిన లాభాల పైన కార్మికుల లో గందరగోళం ఉన్నది అని దీని పైన శ్వేత పత్రం విడుదల చేయాలని. కార్మికులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని. సింగరేణి కి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలను బొగ్గు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సంస్థకు ఇప్పించాలని అలాగే సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇంచార్జ్ సంగం చందర్ ఆర్ సి హెచ్ పి పిట్ సెక్రటరీ  సింగారి శ్రీనివాస్ పి వి కె 5 పిట్ సెక్రటరీ నాగేశ్వరరావు , బడే రమేష్,  స్వప్న, బి అరవింద్, రమేష్, కుమార్, మహిళ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Views: 189
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News