యాచారం మండలంలో భారీ స్థాయిలో పలికిన గణనాధుని లడ్డు
బొల్లిగుట్ట తండాలో 1లక్ష 65 వేలకు పలికిన లడ్డు
On
వేలంలో దక్కించుకున్న మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీటీసీ వర్త్యావత్ రజిత రాజునాయక్
యాచారం మండలం నందివనపర్తి అనుసంధానమైన బొల్లిగుట్ట తండా బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి లడ్డు వేలం పాటలో మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీటీసీ వర్త్యావత్ రజిత రాజునాయక్ నవరాత్రులు పూజలందుకున్న లడ్డును వేలంపాటలో 165000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడి ఆశీస్సులతో తండా వాసులు, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి, గౌర శేఖర్, తండా వాసులు అధిక సంఖ్యలో ఉన్నారు.
Views: 113
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
29 Apr 2026 16:51:08
జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలి :గొల్లపూడి జగదీష్

Comment List