చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

By Ramesh
On
చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

సంగారెడ్డి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి. ఆర్.ఎస్ పార్టీ రానున్న ఐదు ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను 16 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో పాటు టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ , సంగారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే సాధ్యం అని  సదాశివపేట మరియు సంగారెడ్డి కి శాశ్వత నూతన టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ మరియు ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ లు, మహిళల కోసం జూనియర్ డిగ్రీ కాలేజీలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను, అలాగే కళ్యాణ మండపాలను నిర్మిస్తామని అన్నారు. రవీంద్ర భారతి తరహాలో సంగారెడ్డి సదాశివ పేట్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, మనోహర్గౌడ్, విజేందర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్,  శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు