చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

By Ramesh
On
చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

సంగారెడ్డి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి. ఆర్.ఎస్ పార్టీ రానున్న ఐదు ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను 16 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో పాటు టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ , సంగారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే సాధ్యం అని  సదాశివపేట మరియు సంగారెడ్డి కి శాశ్వత నూతన టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ మరియు ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ లు, మహిళల కోసం జూనియర్ డిగ్రీ కాలేజీలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను, అలాగే కళ్యాణ మండపాలను నిర్మిస్తామని అన్నారు. రవీంద్ర భారతి తరహాలో సంగారెడ్డి సదాశివ పేట్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, మనోహర్గౌడ్, విజేందర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్,  శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..